![]() |
![]() |
.webp)
పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోరాన్ని ప్రపంచమంతా చూసింది. అక్కడ జరిగిన దారుణానికి చాలామంది సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్ధించారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట పెహెల్గాం వెళ్లగా ఆ అమ్మాయి భర్తను ఉగ్రవాదులు మట్టుబెట్టారు. తన భర్త శవం పక్కన కూర్చున్న ఆ కొత్త పెళ్లి కూతురు చిత్రం ప్రపంచమంతా వైరల్ గా మారింది. ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 8 లోని చిన్నారులు ఒక స్కిట్ చేశారు. ఆ షో హోస్ట్ అండ్ జడ్జెస్ అంతా కలిసి కాండిల్స్ తో నివాళి అర్పించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు వచ్చాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి బుల్లిరాజు కూడా గన్ పట్టుకుని వచ్చేసాడు.
"అసలు నేనెవరో నీకు తెలుసా..రోజా " అని రెండు చేతులు పైకెత్తి మరీ చెప్పింది. "నువ్వు రోజా ఐతే నేను రాజు బుల్లిరాజు" అన్నాడు ఆ పిల్లాడు. తర్వాత చిన్నారులంతా పహల్గాం నేపథ్యంలో ఒక స్కిట్ చేశారు. అందరూ ప్రకృతి అందాలను ఆరాధిస్తూ ఉండగా టెర్రరిస్టులు రావడం వాళ్ళను కాల్చేయడం వంటివి చేసి చూపించారు. ఇంతలో ఒక చిన్నారి వచ్చి "మాకు పెళ్ళై వన్ వీక్ అయ్యిందండి" అని చెప్పింది. "ఈ ఏడుపేదో మీ సర్కార్ దగ్గర ఏడువు" అంటూ ఆ పిల్లను పక్కకు నెట్టేసి ఆ కొత్తగా పెళ్ళైన అబ్బాయిని కాల్చేశారు. అంటే రియాలిటీలో ఏదైతే జరిగిందో దాన్ని చేసి చూపించారు. తర్వాత జడ్జెస్, హోస్ట్ అందరూ కలిసి ప్రాణాలర్పించిన వారికి కాండిల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇలాంటి ఘటనను ఇంతవరకు ఎవరూ ఊహించలేదు. కాశ్మీర్ అందాల మధ్య ఈ ఏడాది ఇలాంటి ఒక దుస్సంఘటన చోటు చేసుకోవడం మీద ప్రతీ ఒక్కరూ కూడా స్పందించి వారికి నివాళి అర్పించడం మనం చూసాం. ఇప్పుడు జీ తెలుగు కూడా ఈ షో ద్వారా వాళ్లకు ట్రిబ్యూట్ పలికింది.
![]() |
![]() |